Viral: రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..

తాగిన మత్తు ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తూ తన బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్‌పై పడిందని ఓ మహిళ ఆరోపించింది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిందీ ఘటన. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్టు ఆమె తెలిపారు. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.

Viral: రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..

|

Updated on: Jun 16, 2024 | 5:55 PM

తాగిన మత్తు ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తూ తన బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్‌పై పడిందని ఓ మహిళ ఆరోపించింది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిందీ ఘటన. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్టు ఆమె తెలిపారు. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. పై బెర్త్‌లో ఉన్న జవాను మూత్ర విసర్జన చేయడంతో అది మహిళపై పడింది. ఆ వెంటనే ఆమె తన భర్తకు చెబితే ఆయన 139 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కినప్పటికీ జవానుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్ఫీఎఫ్ అధికారులు మాత్రం తాము స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles