క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఎవరైరా తమ విరోధులపై కక్ష తీర్చుకోడానికి వారిని ఏదోరకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారితో తరచూ గొడవలు పడటం లేదా పోలీసు కేసులు పెట్టి కటకటాల్లోకి పంపడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏదైనా వెంటనే జరిగిపోవాలి. న్యాయం కోసం ఎదురు చూసేంత ఓపిక ఇప్పుడు చాలామందిలో లేదు.
అందుకే అలాంటివారు ట్రెండ్ మార్చారు. శత్రువుల వినాశనం వెంటనే జరగాలని కోరుకుంటున్నారు. దీనికోసం క్షుద్ర పూజలు చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజల మూర్ఖులు పెరిగిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకోచోట క్షుద్ర పూజలు వెలుగులోకి వస్తున్నాయి. ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి.. ఓ ఇంటి ముందు ఎలా క్షుద్రపూజలు నిర్వహించారో చూసి అక్కడివారు ఆందోళన చెందుతున్నారు. ఆ ముసుగు మాంత్రికుడి క్షుద్రపూజలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో వెలుగు చూసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాటారం-మహాదేవపూర్ ప్రధాన రహదారి పక్కనే పోచిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించాడు. ముసుగు ధరించి వచ్చిన ఆ వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నల్ల కోడి, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు. ఆ ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

