కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు

|

Sep 15, 2023 | 8:47 PM

భారతదేశంలో పురాతన శివాలయాలు ఎన్నో . వాటిని దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అయితే ఓ 8 ప్రసిద్ధ ఆలయాలకు కామన్‌ పాయింట్‌ ఒకటుంది. అది ఏంటీ అంటే ఆలయాలన్నీ సరళ రేఖలో ఉన్నాయి. దేశం చిత్రపటం చూసినట్లయితే పై నుంచి కిందికి ఒకే లైన్లో ఇవి ఉన్నాయి. ఇది షాకింగ్ కాదా? ఉపగ్రహాలు లేదా మ్యాప్‌లు లేని కాలంలో సరిగ్గా అదే రేఖాంశం 79 డిగ్రీల లాంగిట్యూడ్‌లో దేవాలయాలను ఎలా నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

భారతదేశంలో పురాతన శివాలయాలు ఎన్నో . వాటిని దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. అయితే ఓ 8 ప్రసిద్ధ ఆలయాలకు కామన్‌ పాయింట్‌ ఒకటుంది. అది ఏంటీ అంటే ఆలయాలన్నీ సరళ రేఖలో ఉన్నాయి. దేశం చిత్రపటం చూసినట్లయితే పై నుంచి కిందికి ఒకే లైన్లో ఇవి ఉన్నాయి. ఇది షాకింగ్ కాదా? ఉపగ్రహాలు లేదా మ్యాప్‌లు లేని కాలంలో సరిగ్గా అదే రేఖాంశం 79 డిగ్రీల లాంగిట్యూడ్‌లో దేవాలయాలను ఎలా నిర్మించారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. పురాతన వాస్తుశాస్త్రంలో 79° E రేఖాంశం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకేనేమో అనేక గొప్ప దేవాలయాలను ఈ రేఖాంశంపై నిర్మించారు. కేదార్‌నాథ్ కి రామేశ్వరానికి మధ్య దాదాపు 2383 కి.మీ దూరం ఉంది, అయితే మధ్య ఉన్న మరో 6 ఆలయాలు అన్నీ ఒకే రేఖాంశంలో సరళ రేఖపై ఉన్నాయి. కేదార్‌నాథ్ శివ భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దక్షిణాన ఉన్న రామేశ్వరం కూడా గొప్ప ఆలయం. దాదాపు ఒకే రేఖాంశంలో ఉన్న ఎనిమిది పురాతన శివాలయాల్లో కేదార్నాథ్, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, కాంచీపురం, తిరువానైకావల్, తిరువణ్ణామలై, చిదంబరం, రామేశ్వరం ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!

మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం

బాస్‌..నీ టైమ్‌ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

అయోధ్యలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

 

Follow us on