శరీరానికి జింక్‌ అవసరమని.. ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి

|

Feb 28, 2024 | 9:01 PM

జింక్‌ అనే ఖనిజం మానవ శరీరంలో చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉంటుంది. మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే విషయాన్ని ఓ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తికి ఎవరో చెప్పారు. శరీర నిర్మాణంలో జింక్‌ ఉపయోగపడుతుందని చెప్పడంతో అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా భారీ మొత్తంలో రాగి నాణేలు, అయస్కాంతాలు మింగేశాడు.

జింక్‌ అనే ఖనిజం మానవ శరీరంలో చాలా స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉంటుంది. మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే విషయాన్ని ఓ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తికి ఎవరో చెప్పారు. శరీర నిర్మాణంలో జింక్‌ ఉపయోగపడుతుందని చెప్పడంతో అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా భారీ మొత్తంలో రాగి నాణేలు, అయస్కాంతాలు మింగేశాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రోగికి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని చోటు చేసుకుంది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న స్కిజోఫ్రెనియా అనే వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. 20 రోజులకు పైగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నాడని, ఏమీ తినలేకపోతున్నాడని వైద్యులకు చెప్పారు. మొదట ఔట్ పేషెంట్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ రోగిని పరీక్షించారు. రోగికి మానసిక అనారోగ్యం ఉందని, గత కొన్ని వారాలుగా నాణేలు, అయస్కాంతాలు మింగినట్లు బంధువులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి విరాళాల వెల్లువ

మసాలాలతో క్యాన్సర్‌ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన

బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు

ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

Follow us on