AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముస్లిం రైతుకు చిలుకూరు బాలాజీ అర్చకుడి సాయం.!  వీడియో వైరల్.

Hyderabad: ముస్లిం రైతుకు చిలుకూరు బాలాజీ అర్చకుడి సాయం.! వీడియో వైరల్.

Anil kumar poka
|

Updated on: Mar 21, 2024 | 9:02 AM

Share

యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని ఓ ఆలయ పూజారి ఔదార్యం ప్రదర్శించారు. మానవ సేవే, మాధవ సేవ అన్న నానుడికి సరైన అర్థం చెప్పారు. ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. చిల్కూరు బాలాజీ దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు.

యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని ఓ ఆలయ పూజారి ఔదార్యం ప్రదర్శించారు. మానవ సేవే, మాధవ సేవ అన్న నానుడికి సరైన అర్థం చెప్పారు. ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. చిల్కూరు బాలాజీ దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు. అలాగే, ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిల్కూరు బాలాజీ ఆలయం ఇక్కడి ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటోంది. ఈ క్రమంలోనే విద్యుదాఘాతంలో తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిల్కూరు గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ గౌస్‌కు ఎద్దును బహుమతిగా ఇచ్చారు చిల్కూరు ఆలయ పూజారి. మానవత్వం కులం, మతం చూడదు. తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అన్నారు.

గత రెండేళ్లలో, విద్యుత్ షాక్ తగిలి , పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్వామి గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు. గతంలో విద్యుత్ షాక్ తో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతుకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది. పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని ప్రధాన అర్చకులు కోరారు. రైతులు తమ ఆవులు, గేదెలు, ఎద్దులను కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తారని, అలాగే చూసుకుంటారని చెప్పారు. వాటికి ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు జరిగినట్లే బాధపడతారని చెప్పారు. రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, ఇబ్బందుల్లో ఉన్న రైతులకు పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని రంగరాజన్ పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..