మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!

|

Sep 23, 2022 | 9:16 AM

పెంపుడు జంతువులు తమ యజమాని పట్ల ఎంతో అభిమానాన్ని, ప్రేమను పెంచుకుంటాయి. తమను ఎంతగానో ప్రేమించే యజమాని ఒక్క క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి.

పెంపుడు జంతువులు తమ యజమాని పట్ల ఎంతో అభిమానాన్ని, ప్రేమను పెంచుకుంటాయి. తమను ఎంతగానో ప్రేమించే యజమాని ఒక్క క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. యజమానిని తిరిగి చూసేంతవరకు వాటి కళ్లు వెతుకుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఆవు తన యజమాని మరణించాడని తెలుసుకుని స్మశానానికి పరుగు పరుగున వచ్చింది. తన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి ఆప్యాయంగా తడిమింది. తన యజమాని ఇక తనకు కనిపించడని గ్రహించి కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. ఈ హృదయవిదారక సంఘటన జార్ఖండ్‌లో జరిగింది. హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల చనిపోయాడు. దీంతో బంధువులు, స్నేహితులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఒక ఆవు పరుగున శ్మశానవాటికకు వచ్చింది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కోసం వెతికింది. అక్కడున్న వారు పక్కకు జరగడంతో చివరకు అతడి మృతదేహం వద్దకు చేరుకుంది. యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చింది. అంతేకాదు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. ఇది చూసి మృతుడి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. కాగా, ఈ హృదయవిదారక ఘటనను ఒక యూజర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఆ మూగజీవి ప్రేమకు కన్నీరు పెట్టుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..

కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..

డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!

అమ్మమ్మా మజాకా.. తాతతో బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది !!

Follow us on