40 పైసలు ఎక్కువ‌ చార్జ్ చేశార‌ని కోర్టుకెక్కిన క‌స్ట‌మ‌ర్‌ !! ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా ??

|

Mar 29, 2022 | 9:34 AM

ఓ వ్యక్తి తను హోటల్‌కి వెళ్లినప్పుడు ఆ హోటల్‌ వాళ్లు 40 పైసలు ఎక్కువ వసూలు చేసారని ఏకంగా కోర్టుకెక్కాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో జరిగింది. కోర్టుకెక్క‌డం వ‌ర‌కు బాగానే ఉంది కానీ..

ఓ వ్యక్తి తను హోటల్‌కి వెళ్లినప్పుడు ఆ హోటల్‌ వాళ్లు 40 పైసలు ఎక్కువ వసూలు చేసారని ఏకంగా కోర్టుకెక్కాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో జరిగింది. కోర్టుకెక్క‌డం వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. కోర్టుకు వెళ్లిన తర్వాత సీన్ రివ‌ర్స్ అయి 4 వేలు ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. అస‌లేం జ‌రిగిందంటే.. మూర్తి అనే ఓ సీనియ‌ర్ సిటిజ‌న్ బెంగ‌ళూరులోని సెంట్ర‌ల్ స్ట్రీట్‌లో ఉన్న హోట‌ల్ ఎంపైర్‌కు వెళ్లాడు. అక్క‌డ ఫుడ్ ఆర్డ‌ర్ చేశాడు. ఆ ఫుడ్‌కు స్టాప్ 265 రూపాయలు బిల్లు వేశారు. నిజానికి.. ఆయ‌న ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌కు అయిన బిల్లు 264 రూపాయల 60 పైసలు అయింది. దీంతో ఇదే విష‌యంపై హోట‌ల్ స్టాఫ్‌ను అడిగాడు. కానీ.. హోట‌ల్ స్టాఫ్ అత‌డిని ప‌ట్టించుకోలేదు. రెస్పాండ్ కాలేదు. దీంతో కోపం వ‌చ్చి బెంగ‌ళూరులోని కంజ్యూమ‌ర్ ఫోర‌మ్‌లో కేసు వేశాడు. త‌న వ‌ద్ద నుంచి అదనంగా 40 పైస‌ల‌ను హోట‌ల్ చార్జ్ చేసింద‌ని.. ఇలాగే చాలామంది క‌స్ట‌మ‌ర్ల‌ను హోట‌ల్ లూటీ చేస్తోందంటూ ఫిర్యాదులో మూర్తి పేర్కొన్నాడు. దానికి బ‌దులుగా త‌న‌కు రూపాయి న‌ష్ట‌ప‌రిహారాన్ని హోట‌ల్ చెల్లించేలా తీర్పు చెప్పాలంటూ ఫోర‌మ్‌కు తెలిపాడు.

Also Watch:

Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??

Babu Gogineni Review: ‘తొక్కలో రివ్యూ.. నువ్వేంది చెప్పేది’.. వివాదాస్పదంగా మారిన బాబు గోగినేని రివ్యూ !!

RRR World Record: వరల్డ్ రికార్డ్‌ క్రియటే చేసిన RRR

RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!

నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌

Follow us on