పని ఒత్తిడికి బ్యాంక్‌ ఉద్యోగిని బలి.. డ్యూటీలోనే కుప్పకూలి మృతి

|

Oct 01, 2024 | 9:44 PM

లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. డ్యూటీ చేస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సదాఫ్‌ ఫాతిమా రోజు మాదిరిగానే మంగళవారం ఆఫీసుకు వచ్చారు. డ్యూటీ చేస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలారు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె మృతి చెందినట్లు సహోద్యోగులు చెబుతున్నారు. ఫాతిమా మరణంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత కార్పొరేట్‌ విధానాలు, ఆర్థిక పరమైన ఒత్తిడి ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమనీ దీని గురించి ప్రభుత్వాలు, కంపెనీలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందనీ తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??

బెలూన్లలో చెత్త నింపి వదులుతున్న ఉత్తరకొరియా.. భయంతో కేకలు వేసిన పిల్లలు

గార్డెన్‌లోకి దూసుకొచ్చిన పాము.. పరుగెత్తుకొచ్చిన శునకం.. ఏం చేసిందంటే ??

Follow us on