Hundi Chori: బైక్పై దర్జాగా గుడికొచ్చి…హుండీతో ఊడాయించాడు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న వీడియో
గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దొంగ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి..రాజుపాలెం మండలం రెడ్డి గూడెం ఆర్ ఆర్ సెంటర్ దగ్గర జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు ఓ వ్యక్తి బైక్పై వచ్చాడు..
గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దొంగ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి..రాజుపాలెం మండలం రెడ్డి గూడెం ఆర్ ఆర్ సెంటర్ దగ్గర జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు ఓ వ్యక్తి బైక్పై వచ్చాడు..ముందుగా ఆలయ పరిసరాలను జాగ్రత్త పరిశీలించాడు…ఎవరైనా చూస్తున్నారా…అన్నట్టుగా…అటూ ఇటూ కొద్దిసేపు చూశాడు. బండి ఆ పక్కనే పార్క్ చేసి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వెళ్లాడు. విగ్రహం పక్కనే ఉన్న హుండీని గడ్డపారతో కదిల్చాడు. హుండీని అక్కడి నుంచి తీసుకెళ్లి బైక్పై పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సీన్ మొత్తం పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కానీ, అతడు తెలివిగా తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు..ఆ మర్నాడు ఉదయం గుడికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో వెంటనే ఆలయ సిబ్బంది, పోలీసులకు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..