AP News: కింద 20 రూపాయలు పడ్డాయ్ మీవా అని అడిగాడు.. కట్ చేస్తే…
సొసైటీలో జాదుగాళ్లు పెరిగిపోయారు. సాయం చేస్తున్నట్లు నటిస్తూ నిండా ముంచేస్తున్నారు. ఎవర్నీ నమ్మడానికి లేకుండా పోయింది. తాజాగా సత్తెనపల్లిలో అలాంటి ఘటనే జరిగింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెడికల్ షాపులో మందులు కొనేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని రూ.20 కింద పడేసి ‘డబ్బులు మీవా?’ అని బాధితుణ్ని అడిగారు. అతను వాటికోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ని తెలివిగా కొట్టేసి అక్కడినుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ టీవీలో రికార్డయ్యాయి. బాధితుడు.. పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

