AP News: కింద 20 రూపాయలు పడ్డాయ్ మీవా అని అడిగాడు.. కట్ చేస్తే…
సొసైటీలో జాదుగాళ్లు పెరిగిపోయారు. సాయం చేస్తున్నట్లు నటిస్తూ నిండా ముంచేస్తున్నారు. ఎవర్నీ నమ్మడానికి లేకుండా పోయింది. తాజాగా సత్తెనపల్లిలో అలాంటి ఘటనే జరిగింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెడికల్ షాపులో మందులు కొనేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని రూ.20 కింద పడేసి ‘డబ్బులు మీవా?’ అని బాధితుణ్ని అడిగారు. అతను వాటికోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ ని తెలివిగా కొట్టేసి అక్కడినుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ టీవీలో రికార్డయ్యాయి. బాధితుడు.. పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

