AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

Samatha J
|

Updated on: Apr 22, 2025 | 11:06 AM

Share

కారులో వస్తారు. వీధుల్లో తిరుగుతారు. రహదారి పక్కన పార్కింగ్ స్థలాల్లో నిలిపిన లారీలలోని డీజిల్‌ను దొంగిలిస్తూ లక్షలు ఆర్జిస్తుంటారు. ఆ దొంగల ముఠాను పోలీసులు పక్కా ప్లాన్ తో ఆట కట్టించారు. ముఠా సభ్యులు ఇప్పటివరకు కర్నూలు, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో 10,000 లీటర్లకు పైగా డీజిల్‌ను చోరీ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన 14 మంది కలిసి ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ కార్లలో తిరుగుతూ ఎక్కడ లారీలు నిలిపి ఉంటాయో రెక్కె నిర్వహిస్తారు. కొందరు కాపలా ఉంటే మరికొందరు లారీ వద్దకు వెళతారు. డీజిల్ ట్యాంకుల తాళాలు పగలగొట్టి అందులో పైపులు వేసి తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్లలో నింపుకుంటారు. వెంటనే అక్కడి నుంచి జారుకుంటారు.

చోరీ చేసిన ఇంధనాన్ని విడిగా విక్రయించే చిరు వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదోని వన్ టౌన్ పరిధిలోని ఓ పార్కింగ్ స్థలంలో మార్చి 23, ఏప్రిల్ 8 తేదీల్లో పార్క్ చేసి ఉన్న లారీల్లో సుమారు 5000 లీటర్ల డీజిల్ చోరీ జరిగింది. బాధితులు ఏప్రిల్ 8వ తేదీన వన్ టౌన్ పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డిఎస్పి హేమలత ఒకటో పట్టణం సిఐ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేటలో నిందితులను గుర్తించి 11 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా దాదాపు 10,600 లీటర్ల డీజిల్‌ను దొంగిలించినట్లు తెలియింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. నిందితుల వద్ద నుండి 10,30,000 నగదు, 4 కార్లు, 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో

మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో

ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో