పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. బైక్ ముట్టుకోవాలంటేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే.. బైక్ను పొదుపుగా వాడుతాం అంటారా..? కానీ, అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన ఓ రజకుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. రాయదుర్గంకు చెందిన రమేష్ రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. గతంలో మార్కెట్లో గాడిదల ధరలు విపరీతంగా పెరగడంతో ఓ బైక్ కొని దాని మీద దుస్తులు తీసుకెళ్లడం చేసేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బండి ముట్టాలంటే..పెట్రోల్ ధరలు చూసి భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్లో గాడిదల ధర కంటే, పెట్రోల్ ధరలే ఎక్కువగా ఉన్నాయని భావించిన రమేష్.. గాడిదలే నయమని భావించి వినూత్న ఆలోచన చేశాడు. తనకున్న బైక్ను పక్కన పడేసి, ఓ గాడిదను కొన్నాడు. ఆ గాడిదకే జట్కాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక గాడిద జట్కాతోనే తన వృత్తిని సాఫిగా సాగిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ట్విట్టర్ కు కేంద్రం నోటీసులు..పట్టుదలకు పోతున్న ట్విట్టర్.అసలు విషయం ఏంటి ..?:summons Twitter video.
ఫ్లై ఓవర్ మీద పల్టీలు కొట్టిన కారు.. సినిమా సీన్ తలపిస్తున్న వీడియో..car accident viral video.