Metro Rail Track: మెట్రోరైలు ట్రాక్ మధ్యలోకి దూకిన మహిళ.. ఏం జరిగిందంటే.?
రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి వెళ్లడానికి కొందరు పట్టాలను దాటి వెళ్తుంటారు. కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోరు. రైల్వే అధికారు, సిబ్బంది ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా కొందరు కోరి ప్రమాదాలబారిన పడుతుంటారు. తాజాగా ఓ మహిళ మెట్రో రైలు ట్రాక్పైకి దూకేసింది. ట్రాక్పైన తన సెల్ఫోన్ పడిపోవడంతో దానికోసం ఆమె వెనుకా ముందూ చూసుకోకుండా ట్రాక్పైకి దూకేసింది.
రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి వెళ్లడానికి కొందరు పట్టాలను దాటి వెళ్తుంటారు. కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోరు. రైల్వే అధికారు, సిబ్బంది ఎన్ని విధాలుగా అవగాహన కల్పించినా కొందరు కోరి ప్రమాదాలబారిన పడుతుంటారు. తాజాగా ఓ మహిళ మెట్రో రైలు ట్రాక్పైకి దూకేసింది. ట్రాక్పైన తన సెల్ఫోన్ పడిపోవడంతో దానికోసం ఆమె వెనుకా ముందూ చూసుకోకుండా ట్రాక్పైకి దూకేసింది. అలా ట్రాక్పైకి దూకిన మహిళ 750 కేవీ విద్యుత్ ప్రవహించే ట్రాక్ మధ్యలో పడింది. మహిళ దూకడాన్ని గుర్తించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూముకు సమాచారం అందించడంతోపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ట్రాక్పై పడిపోయిన ఫోన్ను తీసుకున్న మహిళ మరో ప్రయాణికురాలి సాయంతో తిరిగి ప్లాట్ఫాంపైకి చేరుకుంది. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

