viral video: మోదీ నా 15వ కుమారుడు..! అతనికి 25 ఎకరాలు ఆస్తి రాసిస్తా నంటున్న బామ్మ.

Updated on: Jun 30, 2023 | 8:35 PM

ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ప్రజలు మోదీపై తమకున్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు. తాజాగా ఓ పెద్దావిడ మోదీపై తనకున్న ప్రేమను దేశానికి చాటిచెప్పింది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు మంగీబాయి తన్వర్. ఆమెకు 14 మంది సంతానం. ప్రధాని మోదీ కూడా తనకు కొడుకు లాంటివాడని.. 15వ కుమారుడిలానే భావిస్తానని చెబుతోంది. దేశానికి మోదీ ఎంతో సేవ చేస్తున్నారని.. అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారని ఆమె ప్రశంసలు కురిపించింది. తనతో పాటు దేశంలో ఉన్న ఎందరో వృద్ధులకు అండగా నిలిచి వారి అవసరాలను తీరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని తెలిపింది. ఇంత సాయం చేస్తున్న ప్రధానికి తనకు ఉన్న 25 ఎకరాల ఆస్తిని రాసి ఇవ్వనున్నట్లు చెప్పింది. ప్రధాని ఫొటో చూసిన మంగీబాయి ఇతడే మోదీఅని, ఆయనను టీవీల్లో చూశానని చెప్పారు. మోదీ తనకు ఇల్లు ఇవ్వడమే కాకుండా ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని తెలిపింది. వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. తినడానికి ఆహారం అందిస్తున్నారు. ప్రధాని మోదీ వల్లే తీర్థయాత్రలకు వెళ్లగలిగానని, అందుకే మోదీని తన కుమారుడుగా భావిస్తున్నానని చెప్పింది. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉందన్నారు మంగీబాయి. కాగా ప్రధాని మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్‌ కావడం విశేషంగా నిలిచింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. రోడ్‌షోలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..