ఇటీవల కాలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా మానవులకు ఏ కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తారు. తమ కష్టం తీర్చమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తాజాగా ఓ శునకం పాపం ఏం కష్టం వచ్చిందో ఏమోకానీ, నవగ్రహాల చుట్టూ దీక్షగా ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు గ్రహదోషాలు తొలగిపోవాలని ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ 9, లేదా 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. శనిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలా భక్తులు నవగ్రహాలకు పూజలు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ శునకం నేను పూజలు అయితే చేయలేను కానీ ప్రదక్షిణలు చేయగలను.. కనుక వీటితో సరిపెట్టుకొని నా మొర ఆలకించు అన్నట్టుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. శునకం భక్తిని గమనించిన భక్తులు దూరం జరిగి శునకానికి అవకాశమిచ్చారు. అది చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తన భక్తిని చాటుకుంది. ఈ ఘటనను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.