మహిళలు తల్లులుగా మారే సగటు వయస్సు పెరిగింది. గత 20 ఏళ్లలో, కొద్దిమంది మహిళలు తమ 60 వ దశకంలోనూ మాతృత్వంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే 50 ఏళ్ల ఓ మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చారు. రాధికకు వివాహమై 25 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగకలేదు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 5 లక్షల ఖర్చుతో కృత్రిమ గర్భధారణ చికిత్స తీసుకుంది.ఎనిమిదో నెలలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నై ఎగ్మూరు ప్రసూతి ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల సలహాలతో ఆమెకు చికిత్స అందించారు. స్కానింగ్లో పిల్లల్లో రక్తప్రసరణ సక్రమంగా లేకపోవడంతో మెదడు అభివృద్ధి చెందలేదని తెలిసింది. దీనికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు శస్త్రచికిత్స చేయడం ద్వారా రాధిక పిల్లలకు జన్మనిచ్చారు. నెల రోజులపాటు తల్లి ఐసీయూలో, పిల్లలు ఇంక్యుబేటర్లో ఉంచారు. ప్రసుత్తం ముగ్గురూ ఆరోగ్యంగా కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తక్కువ వయసు కలిగిన మహిళలు దానం చేసిన కణాలను ఉపయోగించి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఉత్పత్తి చేసిన పిండాలను అమర్చడం ద్వారా, రుతువిరతి దాటిన మహిళలు గర్భవతి అయి పిల్లలకు జన్మనివ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా పిల్లలు పుట్టిన 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?