Viral: పెన్షన్‌ కోసం 68 ఏళ్ల వృద్ధురాలి అవస్థలు..30 కి.మీ. పాకుతూ వెళ్లిన మహిళా.

|

Nov 18, 2023 | 10:55 AM

నిజంగా ఇది హృదయ విదారక సంఘటన..దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇంటర్‌నెట్‌, ఆన్‌లైన్‌ విధానంతో ప్రజా సేవలు ఎంతో సులువుగా మారిపోయాయి. ఇక బ్యాంకింగ్‌ సేవలు కూడా ప్రజల వాకిట్లోకే వచ్చి చేరుతున్నాయి. ఖాతాదారులు ఏజెంట్ల సహాయంతో ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందేలా సరికొత్త కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. డోర్ స్టెప్ బ్యాంకింగ్ పథకం ద్వారా నగదు డిపాజిట్, విత్ డ్రా, ఆర్థికేతర లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు.

నిజంగా ఇది హృదయ విదారక సంఘటన..దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇంటర్‌నెట్‌, ఆన్‌లైన్‌ విధానంతో ప్రజా సేవలు ఎంతో సులువుగా మారిపోయాయి. ఇక బ్యాంకింగ్‌ సేవలు కూడా ప్రజల వాకిట్లోకే వచ్చి చేరుతున్నాయి. ఖాతాదారులు ఏజెంట్ల సహాయంతో ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందేలా సరికొత్త కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. డోర్ స్టెప్ బ్యాంకింగ్ పథకం ద్వారా నగదు డిపాజిట్, విత్ డ్రా, ఆర్థికేతర లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఇవన్నీ కేవలం వినటానికి, చర్చించుకోవటానికి మాత్రమే అన్నట్టుగా మారింది కొన్ని చోట్ల పరిస్థితి. ఒడిస్సాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 68 ఏళ్ల దివ్యాంగ మహిళ తన పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లేందుకు పడరాని కష్టాలు పడింది. సుమారు 30 కిలోమీటర్లు ఆమె అరచేతులు, కాళ్లతో నడుస్తూ, పాకుతూ వెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 68 ఏళ్ల దివ్యాంగ మహిళ తన పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు 30 కిలోమీటర్లు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత వృద్ధ మహిళ కుష్టు వ్యాధితో బాధపడుతోంది. కాళ్లకు తీవ్రమైన గాయాలతో నడవలేకపోయింది. కానీ, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ డబ్బులు తీసుకోవాలంటే తప్పక బ్యాంక్‌కు వెళ్లాల్సి రావటంతో.. మట్టి, రాళ్లు తేలిన రోడ్డుపై చేతులు, మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చింది.

ఒడిశాలోని గిరిజనులు అధికంగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని కుట్రలో వెలుగు చూసింది ఈ హృదయ విదారక సంఘటన. బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మహిళ గ్రామంలోని సాంప్రదాయ వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటోందని, అతనికి డబ్బు చెల్లించడానికి, ఆ మహిళ తన పెన్షన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ‘జన సేవా కేంద్రానికి’ వెళ్లింది. అయితే, ఆమె బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం కాలేదని సేవా కేంద్రం అధికారులు ఆమెను వెనక్కి పంపించేశారు. మరో మార్గం లేకపోవడంతో వృద్ధ మహిళ తన ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడానికి ఇలా బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకుకు వెళ్లే దారిలో ఓ సామాజిక కార్యకర్త ఆమెను గుర్తించి సహాయం అందించినట్టుగా తెలిసింది. ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఆమె బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు లింక్ అయి ఉందనీ, ఆమెను జన సేవా కేంద్రం అధికారులు మోసం చేశారని తెలిసింది. సామాజిక కార్యకర్త ఆమెకు తన ఖాతా నుండి 1000 రూపాయలు విత్‌డ్రా చేసి ఇచ్చి, ఆమెను తిరిగి తన గ్రామానికి చేరేలా ఏర్పాటు చేశాడు. ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ, ముఖ్యంగా వృద్ధులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో వార్త వైరల్ కావటంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. పెన్షన్ పంపిణీ అధికారులు, సిబ్బంది పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on