ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జ‌రిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??

|

Jan 28, 2023 | 8:00 AM

ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ ఆరు నెల‌ల త‌ర్వాత ఇరు కుటుంబాలు వారి విగ్ర‌హాల‌కు పెళ్లి జ‌రిపించిన ఘ‌ట‌న గుజరాత్‌లో వెలుగుచూసింది.

ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ ఆరు నెల‌ల త‌ర్వాత ఇరు కుటుంబాలు వారి విగ్ర‌హాల‌కు పెళ్లి జ‌రిపించిన ఘ‌ట‌న గుజరాత్‌లో వెలుగుచూసింది. త‌మ కుటుంబ స‌భ్యులు పెళ్లికి అంగీక‌రించ‌ర‌ని తేలిపోవ‌డంతో ప్రేమికులిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. గత ఏడాది ఆగ‌స్ట్‌లో త‌పి ప్రాంతానికి చెందిన గ‌ణేష్‌, రంజ‌న తాడుకు వేలాడుతూ విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌టాన్ని వారి కుటుంబ‌స‌భ్యులు గుర్తించారు. వారు జీవించి ఉండ‌గా తాము ఒకే మాట‌మీద లేక‌పోవ‌డంతోనే ప్రేమికులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని, త‌మ కార‌ణంగానే వారు తీవ్ర నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని ఇరు కుటుంబాలు భావించాయి. దీంతో ప్రేమికుల విగ్ర‌హాల‌ను త‌యారుచేయించిన వారి కుటుంబ పెద్ద‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా విగ్ర‌హాల‌కు వివాహం జ‌రిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: సలార్ ‘కీ సీన్స్‌’ లీక్‌.. నెట్టింట హల్ చల్

మహేష్, జక్కన్న సినిమాకు.. హాలీవుడ్ డైరెక్టర్ సూచనలు

Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్‌ చేరుకున్న మూడు భారతీయ సినిమాలు

Saindhav: రసాయనమే అతడి ఆయుధం.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సైంధవుడు

Rashmika Mandanna: మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.. రష్మిక ఎమోషనల్

Follow us on