ముంబైలోని బైకుల్లాలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. లావుహా ఉన్నావంటూ భర్త పదే పదే ఎగతాళి చేయడంతో తీవ్ర మనస్తాపంతో తనువు చాలించింది. సోమవారం జరిగిన ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. అస్లాం కాండే, తెహ్మీనాలకు 2016లో పెళ్లి జరిగింది. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులతో గొడవ అవుతుండటంతో అస్లాం వేరే కాపురం పెట్టాడు. కొద్ది రోజుల తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓసారి తెహ్మీనా పోలీసులకు పిర్యాదు చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తనతో గొడవపడుతోందని అస్లాం పోలీసులకు చెప్పాడు. అంతే కాదు భార్యను బైకుల్లాలోని ఆమె తల్లి రజియా ఇంటిలో దించేశాడు. ఫిబ్రవరి 14న తల్లి బయటికి వెళ్లిన సమయంలో తెహ్మీనా ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అస్లాంపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెట్ గ్రౌండ్లోకి ఎద్దు ఎంట్రీ.. బ్యాట్లు వదిలి ప్లేయర్స్ పరుగో పరుగు
కోతుల కోసం మినీ సిటీ !! మండిపడుతున్న అమెరికన్స్
కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..
అమృత్ భారత్కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు
విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు