పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ??

|

Oct 16, 2024 | 9:43 PM

పైనాపిల్‌ను అనాస పండు అని కూడా అంటారు. పుల్లగా, తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. మహిళలకైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తినడం వలన పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి పైనాపిల్ జ్యూస్‌ ను తాగించటం ఎంతో మంచిదంటారు నిపుణులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!

ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌‌‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??

తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం

Follow us on