AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో.! వీళ్లు మామూలోళ్లు కాదు.. స్కెచ్ వేస్తే ఆనవాళ్లు కూడా దొరకవ్..

Telangana: వామ్మో.! వీళ్లు మామూలోళ్లు కాదు.. స్కెచ్ వేస్తే ఆనవాళ్లు కూడా దొరకవ్..

Ravi Kiran
|

Updated on: Nov 19, 2024 | 10:30 AM

Share

వరుస దొంగతనాలతో పోలీసులకు సవాలుగా మారింది.. తాళం వేసి ఇల్లే టార్గెట్ చేసుకున్నారు వరుసగా దొంగలు రెచ్చిపోవడంతో పోలీసులకు పెను సవాలుగా మారింది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు జరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. తాళం వేసిన ఇళ్లను గుళ్ల చేస్తున్న దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఒక దొంగతనం మరవకముందే మరో దొంగతనం జరగడంతో పోలీసులు నెత్తి పట్టుకుంటున్నారు. కోటర్మూర్‌కు చెంది సయ్యద్ మొయినోద్దీన్ ఇంట్లో తాళం పగులగొట్టి దొంగతనం జరిగి ఒక్కరోజు గడవకముందే ఎస్టిఓగా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. సుమారు లక్ష రూపాయల నగదు, పది తులాల బంగారం, ఐదు తులాల వెండి ఎత్తుకెళ్లారు. ఇంట్లో వస్తువులు చిందరవందర చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఆర్మూర్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..