భారత్కు వచ్చేసిన స్టార్లింక్… మరింత చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్ కు భారత్ లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం విభాగం లైసెన్స్ ను జారీ చేసింది. భారత్ లో ఈ రకమైన లైసెన్స్ పొందిన మూడోవ కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. ఇప్పటికే యూకే కు చెందిన వన్ వెబ్ భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఈ లైసెన్స్ ను పొందాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే ఈ సేవలు అందిస్తుంది ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ సంస్థ.
విదేశీ సంస్థల రాకతో నాణ్యమైన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో స్టార్ లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్ ను దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ తెలిపింది. స్టార్ లింక్ ఇప్పటికే 125 దేశాల్లో సేవలను అందిస్తుంది. ప్రస్తుతం దేశంలో చాలా వరకు సంప్రదాయ ఇంటర్నెట్ సేవలు వైర్ లెస్ లేదా ఫైబర్ కేబుల్స్ ఆధారంగా అందుతున్నాయి. ఇవి భూమికి సుదూరంగా భూ స్థిర కక్ష్యలో ఉండే ఉపగ్రహాలపై ఆధారపడి ఉన్నాయి. స్టార్ లింక్ సంస్థ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం స్టార్ లింక్ కు చెందిన 6000 శాటిలైట్లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :