17 మంది డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
అది..ఇది..ఏమని.. అన్నిరంగముల అదరగొడుతోంది ఏఐ. ఇటీవల కృత్రిమ మేధ అసాధారణ ప్రతిభను చాటుతోంది. అన్ని రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చి నెమ్మది నెమ్మదిగా మానవాళిపై తన ఆధిపత్యాన్ని చూపుతోంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. వైద్యరంగంలో కృత్రిమ మేధ వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. అమెరికాలో జరిగిన ఓ అసాధారణ సంఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
దాదాపు 17 మంది వైద్య నిపుణులను సంప్రదించినా గుర్తించలేని ఓ వ్యాధిని ఏఐ గుర్తించింది. ఓ మహిళ తన నాలుగేళ్ల కుమారుడికి సోకిన అరుదైన వ్యాధి గురించి డాక్టర్లు నిర్ధారించలేకపోవడంతో ఆ తల్లి, చాట్జీపీటీ ఆశ్రయించింది. ఏఐ సహాయంతో ఆ వ్యాధిని గుర్తించడమే కాకుండా, సరైన చికిత్స అందేలా మార్గం సుగమం చేసుకున్నారు. వివరాలు ప్రకారం… అమెరికాకు చెందిన కోర్ట్నీ అనే మహిళ కుమారుడు అలెక్స్, గత మూడేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో బాలుడిలో వింత లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. తరచూ పంటినొప్పి రావడం, శారీరక ఎదుగుదల మందగించడం, నడకలో సమతుల్యత లోపించడం వంటి ఇబ్బందులను తల్లి కోర్ట్నీ గమనించారు. దీంతో ఆమె మూడేళ్ల వ్యవధిలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో సహా మొత్తం 17 మంది డాక్టర్లను సంప్రదించారు. అయినా ఎవరూ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. కుమారుడి పరిస్థితి చూసి నిస్సహాయ స్థితికి చేరుకున్న కోర్ట్నీకి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అలెక్స్ కు సంబంధించిన అన్ని వైద్య పరీక్షల వివరాలను, ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను, అతను ఎదుర్కొంటున్న లక్షణాలను వివరంగా చాట్జీపీటీలో నమోదు చేశారు. ఆశ్చర్యకరంగా, కొద్ది క్షణాల్లోనే చాట్జీపీటీ ఒక వ్యాధి పేరును సూచించింది. అది ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే అరుదైన నరాల సంబంధిత రుగ్మత అని తెలిపింది. ఈ వ్యాధి వెన్నుముకపై ప్రభావం చూపుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్
ఆ డెలివరీ వ్యాన్కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యం
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది