Woman Cricketer: క్రికెట్‌ రంగంలో తీవ్ర విషాదం.. మహిళా క్రికెటర్‌ ఫారెస్ట్‌లో అనుమానాస్పద మృతి..!

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడిశా మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్‌ మృతదేహం కటక్‌ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా

Woman Cricketer: క్రికెట్‌ రంగంలో తీవ్ర విషాదం.. మహిళా క్రికెటర్‌ ఫారెస్ట్‌లో అనుమానాస్పద మృతి..!

|

Updated on: Jan 23, 2023 | 8:24 AM


భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడిశా మహిళా క్రికెట్‌ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్‌ మృతదేహం కటక్‌ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు. డీసీపీ పీనాక్‌ మిశ్రా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి రాజశ్రీ కనిపించడం లేదని, ఆమె తల్లిదండ్రులు మంగళబాగ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించిందన్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశామన్నారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని రాజశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని వారు చెబుతున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం.. ఈ నెల 18 నుంచి పూడుచూరులో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఒడిశా క్రికెట్‌ అసోసియేషన్‌ 25 మందిని ఎంపిక చేసింది. వీరికి బజరకుబట్టి ప్రాంతంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. రాజశ్రీ అందులో పాల్గొంది. 11న తండ్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరి తిరిగి కనిపించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us