AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

Rohit Sharma: రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌

Phani CH
|

Updated on: Jan 19, 2026 | 9:52 PM

Share

టీమ్ ఇండియా రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తొలగింపుపై దుమారం రేగింది. ఈ నిర్ణయం వెనుక అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ ఉన్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. ఐసీసీ టోర్నీలు గెలిపించిన కెప్టెన్‌ను ఇలా తొలగించడం అవమానకరమన్న తివారీ, శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం తాజాగా క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలను భారత్‌కు అందించిన కెప్టెన్‌పై వేటు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందిస్తూ.. రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఇద్దరు కీలక వ్యక్తుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారని ఆయన స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌లో కెప్టెన్ల మార్పు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే, రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించడంపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడడు. కానీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాడి విషయంలో ఇంత పెద్ద సాహసం అతను ఒక్కడే చేయలేడు. దీని వెనుక ఖచ్చితంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు ఉండి ఉంటాయి. వీరిద్దరూ కలిసే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు అని మనోజ్‌ తివారి ఆరోపించాడు. ఐసీసీ టోర్నీల్లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌ను ఇలా అర్ధాంతరంగా తొలగించడం రోహిత్‌ను అవమానించడమేనని తివారీ అభిప్రాయపడ్డాడు. “వరల్డ్ కప్ 2027 వరకు రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటాడో లేదో అని సెలక్టర్లు అనుమానించడం సరికాదు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డు ఉన్న ఆటగాడి సామర్థ్యాన్ని శంకించడం పొరపాటు అన్నాడు. ప్రస్తుత భారత తుది జట్టు ఎంపికలో చాలా లోపాలు ఉన్నాయని తివారీ విమర్శించాడు. బౌలర్ల ఎంపిక, ఆటగాళ్ల మార్పుల విషయంలో అసమానతలు ఉండటం వల్ల తనకు వన్డే క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మను కేవలం బ్యాటర్‌గా పరిమితం చేసి, గిల్‌ను కెప్టెన్ చేయడం టీమ్ ఇండియా భవిష్యత్తుకు ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే, సెలక్టర్ల ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టాలెక్కిన వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్

ఇరాన్ లో పరిస్థితి దారుణం.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు

క్రిమినల్‌ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

Gold Price Today: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!

వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్‌ జామ్‌