Mohammed Kaif: వాళ్లిద్దరూ లేకుండా కప్ గెలవలేం

Updated on: Dec 09, 2025 | 3:22 PM

దక్షిణాఫ్రికా సిరీస్‌లో టీమిండియా విజయానంతరం మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం, ఫామ్ అనివార్యమని కైఫ్ అభిప్రాయపడ్డారు. యువకులు ప్రతిభావంతులైనప్పటికీ, పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని తట్టుకోవడానికి సీనియర్ల నాయకత్వం, బాధ్యతాయుతమైన ఆట చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమిండియా భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ, 2027 ప్రపంచ కప్‌లో వీరిద్దరూ లేకుండా భారత్ గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే భారత్ 2027 ప్రపంచ కప్ గెలవలేదు. యువ ఆటగాళ్లు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని జయించడానికి అనుభవం చాలా అవసరం,” అని పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనను కైఫ్ ఆకాశానికెత్తారు. “కోహ్లీ ఈ సిరీస్‌లో రెండు వరుస సెంచరీలు చేయడమే కాకుండా, మూడో వన్డేలో 45 బంతుల్లోనే అజేయంగా 65 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అతను కేవలం 2027 వరకే కాదు, ఆ తర్వాత కూడా ఆడే సత్తా ఉన్న ఆటగాడు. ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు చూస్తుంటే, తన రిటైర్మెంట్ గురించి వస్తున్న సందేహాలన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నట్లుంది,” అని కైఫ్ వ్యాఖ్యానించారు. “రోహిత్ ఇప్పుడు కేవలం మెరుపు ఇన్నింగ్స్‌లకే పరిమితం కావడం లేదని… పరిస్థితిని బట్టి ఆడుతూ, వికెట్ విలువను కాపాడుకుంటున్నాడని మహ్మద్ కైఫ్ అన్నారు. మూడో వన్డేలో అతను చేసిన 75 పరుగులు ఇందుకు నిదర్శనం. కెప్టెన్సీ లేకపోయినా, ఒక సీనియర్ బ్యాటర్‌గా బాధ్యతాయుతంగా ఆడుతూ పెద్ద ఇన్నింగ్స్‌లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడని కైఫ్ విశ్లేషించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే

సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది