ఒకే నెలలో రెండు గ్రహణాలు.. జాగ్రత్త అంటున్న పండితులు

Updated on: Mar 10, 2025 | 9:02 PM

హిందూ మత విశ్వాసం ప్రకారం గ్రహణాన్ని కొందరు అశుభంగా పరిగణిస్తే కొందరు శుభంగా భావిస్తారు. సాధారణంగా గ్రహణ సమయాన్ని సూత కాలంగా భావిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదని పండితులు చెబుతారు. దీనివెనుక సైన్స్‌ కూడా దాగిఉంది. గ్రహణం సమయంలో ఆహారాన్ని తీసుకుంటే అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుందని వైద్య నిపుణులు సైతం చెబుతారు.

గ్రహణం సమయంలో తినాలా, వద్దా అనే వాదనకు ముగింపు లేనప్పటికీ కొందరి నమ్మకాల ప్రకారం గ్రహణం కాలలో తినేవారు అనారోగ్యానికి గురవుతారని, తినకపోవడమే మంచిదని చెబుతారు. సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం, చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం ఎప్పుడూ అమవాస్య రోజు జరిగితే.. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు జరుగుతుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుని కిరణాలు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. దీంతో పాక్షికంగా వచ్చే సూర్యకిరణాలు మానవ శరీరానికి హాని కలుగజేస్తాయి. అంతేకాకుండా ఈ కిరణాలు ఆహారం మీద పడినపుడు రేడియేషన్ ద్వారా చెడు ప్రభావం కలుగుతుంది. ఈ ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది. ఎందుకంటే రేడియేన్ చాలా శక్తిమంతమైనది. గ్రహణం కాలంలో వండిన ఆహారంపై కిరణాలు పడినపుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆహారం తినడం వలన అజీర్తికి దారితీస్తుందని పలువురు నిపుణులు చెబుతారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తె.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..

చంద్రుడి మీద సూర్యోదయం ఎలా ఉంటుందో చూశారా

మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ

నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు

ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?