ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
చల్లని నీరు తాగితే శరీరానికి మేలు జరుగుతుందనుకునే వారు చాలా మంది ఉంటారు. వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఒంటికి ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఎండలో ఉన్నాక వెంటనే లీటరు పైగా నీరు తాగడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
వేసవిలో నీరు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా తగినన్ని నీళ్లు తాగాలి కానీ.. ఒకేసారి అధికంగా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శరీరానికి అవసరమైన నీటి మోతాదును తెలుసుకుని కొద్దికొద్దిగా తాగటం మంచిది. ఇంట్లో ఉండే మహిళలు, పెద్దవారు రోజుకు 3-4 లీటర్ల వరకు తాగడం మంచిది. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎయిర్ కండిషన్ గదుల్లో పనిచేసేవారు 2.5-3 లీటర్లు తాగాలి. బయట ఎక్కువ సమయం గడిపే వారు, కూలీలు, రైతులు 4-5 లీటర్ల వరకు తాగాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎండకు వెళ్లే ముందు కొద్దిగా నీరు తాగడం మంచిది. పని చేసే సమయంలో ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మేలు. టైమ్కు నీరు తాగేందుకు అలారం పెట్టుకోవడం వల్ల మర్చిపోకుండా ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Whatsapp: ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్లో మరో అమేజింగ్ ఫీచర్
తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్లో పడ్డ సిరాజ్ ??
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..