Telangana: “జలగంకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డకు రాబోతోంది”
ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. అందుకోసం కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని భట్టి పిలుపునిచ్చారు. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. నాలుగోసారి ఆశీర్వదించి.. గెలిపించాలని భట్టి ప్రజలను కోరారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావుకు ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశం… ఇప్పుడు మీ మధిర బిడ్డగా తనకు రాబోతోందన్నారు. నాలుగోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. BRS ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని భట్టి చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. . కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నరు భట్టి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి
టప టపా పేలిపోయిన సెల్ ఫోన్లు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర ... కళ్ళు చెదిరే దృశ్యం
మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు
హలీం ధరకు రెక్కలు..సింగిల్ ప్లేట్ ఏకంగా..

