Telangana: “జలగంకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డకు రాబోతోంది”
ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. అందుకోసం కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని భట్టి పిలుపునిచ్చారు. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. నాలుగోసారి ఆశీర్వదించి.. గెలిపించాలని భట్టి ప్రజలను కోరారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావుకు ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశం… ఇప్పుడు మీ మధిర బిడ్డగా తనకు రాబోతోందన్నారు. నాలుగోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. BRS ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని భట్టి చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. . కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నరు భట్టి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

