AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: ఎస్సీ వర్గీకరణలో ఉన్న ప్రతిబంధకాలేంటి? రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించిందా?

BJP: ఎస్సీ వర్గీకరణలో ఉన్న ప్రతిబంధకాలేంటి? రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించిందా?

Srikar T
|

Updated on: Nov 11, 2023 | 7:11 PM

Share

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు మందకృష్ణమాదిగ. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు మాటలు చెబుతుంటే.. బీజేపీ చేసి చూపించిందన్నారు. మాదిగ సామాజికవర్గానికి పెద్దన్నగా మోదీ వచ్చి భరోసా ఇచ్చారన్నారు. బీసీని సీఎం చేస్తామని చెప్పిన నాలుగు రోజులకే మళ్లీ ఎస్సీల సభలో పాల్గొని తన చిత్తశుద్ధిని ప్రధానమంత్రి నిరూపించుకున్నారన్నారు. బీసీ కావడం వల్లే ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతి పదవులు దక్కాయన్నారు మందకృష్ణ మాదిగ.

సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు మందకృష్ణమాదిగ. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు మాటలు చెబుతుంటే.. బీజేపీ చేసి చూపించిందన్నారు. మాదిగ సామాజికవర్గానికి పెద్దన్నగా మోదీ వచ్చి భరోసా ఇచ్చారన్నారు. బీసీని సీఎం చేస్తామని చెప్పిన నాలుగు రోజులకే మళ్లీ ఎస్సీల సభలో పాల్గొని తన చిత్తశుద్ధిని ప్రధానమంత్రి నిరూపించుకున్నారన్నారు. బీసీ కావడం వల్లే ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతి పదవులు దక్కాయన్నారు మందకృష్ణ మాదిగ. బీజేపీకి అండగా ఉందాం.. పెద్దన్నకు అండగా ఉందాం. నో కాంగ్రెస్‌, నో బీఆర్ఎస్‌ నినాదాలు వినిపించిన మంద కృష్ణ మాదిగ. మాదిగ సామాజిక వర్గాలకు హామీలు ఇవ్వడానికి మాత్రమే తాను రాలేదని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్ధాలుగా పార్టీలు, నాయకులు మీ పట్ల చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి వచ్చానంటూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విషయంలోనూ, మాదిగ సామాజికవర్గం పట్ల విశ్వాసఘాతకానికి కాంగ్రెస్ పాల్పడింది. ఎన్నో బలిదానాలకు కారణమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది. దళితుడినే తొలి సీఎం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం సీటును కేసీఆర్‌ కుటుంబం కబ్జా చేసింది. పేద దళిత, గిరిజన, రైతులను మోసం చేశారంటూ మోదీ విమర్శలు చేశారు. ఇరిగేషన్‌ పేరుతో భారీ స్కామ్‌లకు పాల్పడిందని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 11, 2023 07:07 PM