మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంతో.. అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బంతి సీబీఐ కోర్టులో చేరింది. దీంతో అసలేం జరుగుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది..