AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది

KTR: రూ.1400కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడింది

Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 11:23 PM

Share

కే. టి. రామారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్ను పడిందని తెలిపారు. బాధితులైన సతీష్ షా, పల్లవి షా కుటుంబం తమ 27 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునేందుకు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్ను పడిందని కే. టి. రామారావు సంచలన ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. దాదాపు 60 సంవత్సరాలుగా సతీష్ షా కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భూమి విలువ ఎకరాకు కనీసం 50 కోట్లు ఉంటుందని, మొత్తం 1300-1400 కోట్ల రూపాయల విలువ చేస్తుందని వెల్లడించారు. పొంగులేటి, ఆయన కుమారుడు, ఒక మంత్రి స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పల్లవి షా వివరించారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని 22ఏ నిషేధిత జాబితా నుండి భూమిని తొలగిస్తామంటూ 50% వాటా అడిగారని, లేదంటే ల్యాండ్ రికార్డులను మార్చి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us