Watch Video: రేవంత్ రెడ్డి వాహనంలో పోలీసుల తనిఖీలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు. రాజకీయ ప్రముఖుల వాహనాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. రేవంత్ రెడ్డి తనిఖీలకు పూర్తిగా సహకరించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

