Watch Video: రేవంత్ రెడ్డి వాహనంలో పోలీసుల తనిఖీలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు. రాజకీయ ప్రముఖుల వాహనాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. రేవంత్ రెడ్డి తనిఖీలకు పూర్తిగా సహకరించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

