Watch Video: అన్నకు సోదరి ఎన్నికల ప్రచారం.. గెలుపే లక్ష్యంగా

Edited By:

Updated on: May 10, 2024 | 8:44 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించడం కోసం ఆయన సోదరి తిలోత్తమ ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంట, లింగాలగట్టు గ్రామంలో గడపగడపకు తిరుగుతూ వైఎస్సార్సీపీ కరపత్రాలు పంచుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప చక్రపాణి రెడ్డికి ఫ్యాను గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించడం కోసం ఆయన సోదరి తిలోత్తమ ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంట, లింగాలగట్టు గ్రామంలో గడపగడపకు తిరుగుతూ వైఎస్సార్సీపీ కరపత్రాలు పంచుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప చక్రపాణి రెడ్డికి ఫ్యాను గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరో పక్క వైసిపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ శిల్పా చక్రపాణి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. అలానే గత వారం రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సుండిపెంట, లింగలగట్టు గడపగడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తన అన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే శ్రీశైలం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరిస్తున్నారు ప్రచారంలో శిల్పా సోదరి తిలోత్తమ వెంట స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us