Minister KTR: ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది

Updated on: Mar 18, 2023 | 2:02 PM

టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పందించారు. కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని పేర్కొన్నారు.

టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పందించారు. కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్‌పీఎస్‌సీ పనిచేస్తోందన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు కేటీఆర్‌. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గతంలో ఫీజు చెల్లించినందు వల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదని చెప్పారు. 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌ మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో పెడతామని వెల్లడించారు. రీడింగ్‌రూమ్‌లు 24 గంటలు తెరిచే ఉంటాయి.. భోజన వసతి కూడా ఉంటుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!

Kantara: వావ్‌ !! కాంతారకు ఆస్కార్‌ రేంజ్‌ గౌరవం..

జపాన్‌ గడ్డపై 100కోట్ల దిశగా RRR..

Pathaan: RRR వల్లే కానిది పఠాన్‌ చేసి చూపించారు !!

RRR: ఫ్యాన్స్‌ దాటికి ఉక్కిరిబిక్కిరైన జక్కన్న, కీరవాణి

 

Published on: Mar 18, 2023 01:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us