కల్నల్ సంతోష్బాబు త్యాగానికి ఎప్పుటికీ మరువలేనిదని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గత ఏడాది చైనా సరిహద్దుల్లో వీరపోరాటం చేసి అమరుడైన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. గాల్వాన్ ఘర్షణల్లో చైనా సైనికుల్నితరిమికొట్టే క్రమంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు కాంస్య విగ్రహాన్ని.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆవిష్కరించారు.చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కర్నల్ సంతోశ్బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్, మరో మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వైఎస్ షర్మిల పార్టీలో అసంతృప్తి సెగ.. అడహాక్ కమిటీకి మహబూబ్ నగర్ నేతలు రాజీనామా వీడియో :YS Sharmila video.
Pooja Hegde Video:హాట్ నెస్ ఓవర్లోడెడ్ బుట్టబొమ్మా.. మరీ ఇంత అందమైతే ఎట్టాగమ్మా.. !వీడియో.