కామారెడ్డిలో మూడో రోజు రైతుల ఆందోళనలు కొనసాగాయి. పంటలు పండే తమ భూములు తీసుకోవద్దంటూ గ్రామాల్లో, పొలాల్లో రైతులు నిరసనలు నిర్వహించారు. రైతుల ఆందోళన ఉధృతితో మాస్టర్ ప్లాన్పై ఎమ్మెల్యే గంపగోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్జోన్ మారుస్తామని చెప్పారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను..ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగిస్తామని గంప గోవర్థన్ హామీ ఇచ్చారు.గంపగోవర్ధన్, కామారెడ్డి ఎమ్మెల్యే. మరోవైపు మాస్టర్ ప్లాన్పై కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ వివరణ ఇచ్చారు. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను బట్టి మాస్టర్ ప్లాన్ రద్దు ఆలోచిస్తామని అన్నారు. మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే అనీ, భూమి పోతుందనే భయాలు వద్దన్నారు కలెక్టర్ జితేష్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos