ALAI BALAI: దత్తాత్రేయ అద్వర్యంలో ‘అలాయ్ బలాయ్’ అదుర్స్ .. సందడిగా జలవిహార్‌.. (వీడియో)

అన్ని పక్షాలు ఏకమై.. అన్ని రంగాల ప్రముఖులు మమేకమై.. అందరి ఆత్మీయ సమ్మేళన వేదిగా నిలిచింది జలవిహార్‌లో జరిగిన దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కరోనా వారియర్స్ వరకు అంతా హాజరై అలయ్ బలయ్ అంబలి తాగి వేడుకను సందడిగా మార్చారు.

ALAI BALAI: దత్తాత్రేయ అద్వర్యంలో 'అలాయ్ బలాయ్' అదుర్స్ .. సందడిగా జలవిహార్‌.. (వీడియో)

|

Updated on: Oct 23, 2021 | 8:51 AM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా పండుగ తర్వాత అందరి ఆత్మీయ కలయిక కోసం 16 ఏళ్ల కిందట అలయ్ బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బద్ద శత్రువులు సైతం వచ్చి అంబలి తాగి అవతలి వ్యక్తిని కౌగిలించుకున్న ఏకైక వేదిక అలయ్ బలయ్. దత్తన్న రాజ్యాంగబద్ద పదవిలో ఉండటంతో ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకొని జలవిహార్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు మహమ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేకే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సహా పలువురు వీఐపీలు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.

అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో భాగంగా తొలుత గవర్నర్ తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజన మహిళలతో కలిసి గవర్నర్ నృత్యం చేశారు. కోలాటం ఆడారు.వేదిక వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దుర్గామాత, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అలయ్ బలయ్ లో అంబలి ఇచ్చి కండువాలను కప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్‌ బలయ్‌ను జరుపుతున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ అధినేత ప్రసాద్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమ దాట్ల, మా అధ్యక్షుడు మంచు విష్ణు, కవితను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డామని.. కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు తెలియజేయడం, అందరినీ మమేకం చేసే గొప్ప కార్యక్రమని వెంకయ్యనాయుడు ప్రోగ్రాంను అభినందించారు..
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Space death (Know this): స్పేస్‌లో మనిషి చనిపోతే ఏమవుతుంది.? సైంటిస్టులు ఇచ్చిన క్లారిటీ ఏంటి..? (వీడియో)

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?