గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ పథకం రద్దు వెనుక బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చే కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం "వన్ మ్యాన్ షో" నడుపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. జనవరి 5 నుంచి మన్ రేగా బచావో అభియాన్ నిర్వహించనుంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, తద్వారా బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Gold Price Today: ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..
21 ఏళ్ల క్రితం క్రిస్మస్కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్కు ఎంత పెరిగిందంటే
