Telangana: బీఆర్‌ఎస్ వెలుగు దివ్వెలను దేశమంతా విస్తరిస్తాం : సీఎం కేసీఆర్

BRS ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్‌ కనిపిస్తోంది. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు. " అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌" అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Telangana: బీఆర్‌ఎస్ వెలుగు దివ్వెలను దేశమంతా విస్తరిస్తాం : సీఎం కేసీఆర్

|

Updated on: Dec 09, 2022 | 4:31 PM

తెలంగాణభవన్‌కు చేరుకున్నారు CM కేసీఆర్. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజ చేశారు. సరిగ్గా 1:20 నిమిషాలకు BRS పత్రాలపై సంతకం చేశారు. అనంతరం BRS పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్‌రాజ్‌, కుమారస్వామి హాజరయ్యారు. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే BRS లక్ష్యమన్నారు నేతలు. ఆ టార్గెట్‌ కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.

Follow us