తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. KCR ప్రభుత్వంపైనే డైరెక్ట్ అటాక్ చేశారు. రాజ్భవన్ని, మహిళా గవర్నర్ని గౌరవించాల్సిందే అంటూ నొక్కి చెప్పారు. అటు జుబ్లీహిల్స్ పబ్లో మైనర్ బాలిక రేప్ ఘటనపైనా గవర్నర్ గరంగరంగా మాట్లాడారు. అంతే వేగంగా దర్బార్ కాదు… పొలిటికల్ దర్బార్ అంటూ అధికారపార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా పడ్డాయి. అయితే చిత్రంగా కాంగ్రెస్లో దీనిపై భిన్నస్వరాలున్నాయి.. ఒకరు తప్పేముంది అంటే.. మరొకరు తప్పుపడుతున్నారు.