టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జూలై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని గవర్నమెంట్ తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలు తీసేసుకున్నాయి. ఇంకా ఏపీ, కేరళ వంటి రాష్ట్రాలు మాత్రమే వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. దీనిపై సుప్రీం కోర్టులో ఇటీవల విచారణ జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.
బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.