తనకు మళ్లీ 2+2 గన్ మెన్ లు ఇవ్వాలని దువ్వాడ విజ్ఞప్తి

Updated on: Dec 27, 2025 | 10:03 PM

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ, తన భద్రతను 2+2 గన్‌మెన్‌లకు పెంచాలని శ్రీకాకుళం ఎస్పీని కోరారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ సంచలన ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు భద్రత తొలగించడం అన్యాయమని పేర్కొంటూ, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన పరిణామంలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంటూ, తిరిగి 2+2 గన్‌మెన్‌ల భద్రత కల్పించాలని శ్రీకాకుళం ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో తనకు 2+2 గన్‌మెన్లు ఉండేవారని, అయితే ప్రస్తుతం 1+1కి తగ్గించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని, తన ప్రాణానికి తీవ్ర ముప్పు ఉందని ఆయన ఎస్పీకి వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట