CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Updated on: Dec 27, 2025 | 10:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు స్వల్ప మార్పులు చేస్తూ, నెల్లూరు జిల్లాలో గూడూరు కొనసాగింపు, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడులను ఖరారు చేశారు. అయితే, జనగణన నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ, తిరుపతి ఏర్పాటును ప్రస్తుతానికి వాయిదా వేశారు. తుది నోటిఫికేషన్ ఈ నెల 31న వెలువడనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ పాల్గొన్నారు. ప్రజాభిప్రాయాల మేరకు పునర్విభజనలో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించారు. నవంబర్ 27న విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్‌పై అందిన 927 అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట