CM Chandrababu: అమరావతిని ఇక ఎవరూ ఇంచ్ కూడా కదల్చలేరు
కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. అయితే, ఈ తీర్మానంపై బొత్సా సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేస్తూ, గతంలో అమరావతి నిర్మాణంపై జరిగిన ఖర్చు, దాని ప్రగతిని ప్రశ్నించారు. ఈ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
అమరావతి రాజధాని స్థితిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక ఎవరూ ఇంచు కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, “మూడు ముక్కలాట లేదు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని – అదే అమరావతి” అని పునరుద్ఘాటించారు. శాసనసభలో తీర్మానం చేసినట్లు పేర్కొంటూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, సత్తాను చూపిస్తామని తెలిపారు. త్వరలోనే కేంద్రం కూడా దీనిపై చట్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు
ఇక రైళ్లలో 'డగ డగ' శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్

