Hyderabad: ఓటేసినప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుంది.. యువతకు మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కీలక సూచన

|

May 13, 2024 | 6:00 PM

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌లో ఓటేశారు మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. యువత ఓటింగ్‌కు దూరంగా ఉండడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. ఓటేసినప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైతన్యం పట్టణ ప్రాంతాల్లో లేకపోవడంతో ఓటింగ్‌ శాతం తగ్గుతోందన్నారు.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌లో ఓటేశారు మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. వృద్దులే ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారని..  యువత ఓటింగ్‌కు దూరంగా ఉండడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. యువత ఓటు విలువను గుర్తించకపోవడం కరెక్ట్ కాదన్నారు. పునరాలోచన చేసి.. ఓట్లు వేసేందుకు యువత తరలి రావాలని సూచించారు. ఓటేసినప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైతన్యం పట్టణ ప్రాంతాల్లో లేకపోవడంతో ఓటింగ్‌ శాతం తగ్గుతోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

 

Follow us on