Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే
ఈ ఏడాది ముందే పలకరించి, సమృద్ధిగా వర్షాలను కురిపించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైంది. ఆదివారం పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరుగు ప్రయాణం మొదలైంది. సాధారణంగా ఏటా సెప్టెంబరు 17న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఈసారి మూడు రోజుల ముందుగానే మొదలవడం గమనార్హం.
అయితే.. ఈ ఏడాది ఈ సీజన్లో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 14 మధ్య కాలంలో సాధారణంగా 790.1 మిల్లీమీటర్ల వర్షం కురిసేది. కానీ.. ఈసారి 846.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే 7 శాతం అధికం. ఓవైపు రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమైన వేళ, బంగాళాఖాతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ అధికారుల అంచనా ప్రకారం ఈ ఆవర్తనం సెప్టెంబర్ 20వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే, అది ఆ తర్వాత మరింత బలపడుతుందా? లేదా? అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Honey Trap: హనీ ట్రాప్లో యోగా గురువు.. ఆ తర్వాత
దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

