రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,

|

Sep 04, 2023 | 9:04 PM

రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో ఆగస్టు 31న ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. మ‌రో వ్యక్తితో రిలేష‌న్‌లో ఉన్న కార‌ణంగా ఆమెపై అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో ఆగస్టు 31న ఈ దారుణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. మ‌రో వ్యక్తితో రిలేష‌న్‌లో ఉన్న కార‌ణంగా ఆమెపై అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. పెళ్లి చేసుకున్న ఆమె మ‌రో వ్యక్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్నట్లు ఆమె భర్త, అత్తమామలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆమెను భర్త, అత్తమామలు కిడ్నాప్ చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇష్టారీతిన చేయిచేసుకుని ఆపై నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. మరికొన్ని గంటల్లో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అమానవీయ ఘటనను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పౌర సమాజంలో ఇటువంటి నేరగాళ్లకు స్థానం లేదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??

మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??

వ్యూస్‌ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??

కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు

బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..

 

 

Follow us on