ఎద్దు పొడవడంతో వ్యక్తి మృతి..

|

Jun 23, 2023 | 8:48 PM

ఎద్దు దాడి చేయడంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రామకృష్ణ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 21న తాళ్లేసతండా వద్ద టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆవుల మంద రోడ్డుపైకి అడ్డంగా..

ఎద్దు దాడి చేయడంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రామకృష్ణ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 21న తాళ్లేసతండా వద్ద టిఫిన్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఆవుల మంద రోడ్డుపైకి అడ్డంగా రావడంతో వాటిని తప్పించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆవులతో పాటు ఎద్దు దాడి చేయడంతో రామకృష్ణ గొంతు కింద బలమైన గాయాలయ్యాయి. దాంతో అటుగా వస్తున్న స్థానికులు గమనించి రామకృష్ణను హాస్పిటల్​కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్​ఐ వెంకటక్రిష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. నిఘా నీడలో దారుణాలు..

Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై చిరుత దాడి

త్రుటి లో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Pink Whatsapp: పింక్‌ వాట్సాప్‌తో జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేసారో అంతే..

 

Follow us on