Tirupati: SV వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం

Updated on: Oct 13, 2025 | 3:27 PM

తిరుపతిలోని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. హాస్టల్ సమీపంలో చిరుతను గమనించిన విద్యార్థులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిరుతకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.

తిరుపతిలోని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ సమీపంలో చిరుత సంచరిస్తుండటాన్ని అక్కడి విద్యార్థులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. చిరుత సంచారం గురించి తెలియగానే విద్యార్థులు భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. చిరుత జాడను గుర్తించి, దానిని సురక్షితంగా పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pedda Amberpet: పెద్ద అంబర్‌పేట్ లో దొంగల బీభత్సం

Bihar Politics: బిహార్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ

ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా

ఒంగోలు పేస్‌ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం